17-03-2025 01:18:16 AM
ఇబ్రహీంపట్నం, మార్చి 16 (విజయ క్రాంతి): చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంకు చెందిన సింగారం మధు స్థానిక మున్సిపాలిటీలో వాటర్ మన్ గా పని చేస్తు న్న వ్యక్తి శుక్రవారం నుంచి కనిపించకుండ పోయాడు.
కాగా అతని తల్లిదండ్రులు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ రోజు ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పెద్ద తూమ్ వద్ద మధు పర్సు, చెప్పులను గుర్తించిన ఇబ్రహీంపట్నం పోలీసులు, డిఆర్ఎఫ్ బృందం సాయంతో సుమారు 4 గంటలపాటు గాలింపు చర్యలు చేపట్టి, చెరువులో నుండి మధు మృతదేహం వెలికి తీశారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.