21-04-2025 11:06:07 PM
నిజాంసాగర్(విజయక్రాంతి) నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగు చూసింది. నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపిన ప్రకారం అబ్దుల్ సలాం 37 సంవత్సరాలు అనే యువకుడు ఆదివారం రాత్రి నిజాంసాగర్ ప్రాజెక్టు లో దూకి ఆత్మ హత్య చేసుకోవడం జరిగిందన్నారు మ్రుతుడి తమ్ముడు అబ్దుల్ రెహమాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుడు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టడం శంకర్ నగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.