calender_icon.png 21 September, 2024 | 1:44 PM

అప్పుల బాధతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మ హత్య..

21-09-2024 12:12:22 PM

నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం అభంగపట్నం గ్రామానికి చెందిన అల్లె వినోద్ కుమార్(30) బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్ళాలని వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ లో ఫెయిల్ అవ్వడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఫిజికల్ టెస్ట్ లో ఫెయిల్ అవ్వడం, అప్పులు ఉండడంతో తీవ్ర మనస్థాపానికి గురై అర్ధ రాత్రి ప్రాంతంలో నవీపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇట్టి విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు.