calender_icon.png 27 October, 2024 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏలూరులో యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది

30-05-2024 04:22:29 PM

సత్రంపాడు: ఏలూరు జిల్లా సత్రంపాడులో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో గొంతుకోశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే మృతిచెందింది. ప్రైవేట్ కాలేజీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న యువతి పెళ్లికి నిరాకరించడంతోనే దాడి చేసినట్లు తెలుస్తోంది. నిందితుడిని ఏసురత్నంగా గుర్తించారు. అనంతరం గొంతు కోసుకుని ఏసురత్నం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.