26-03-2025 01:33:01 PM
లొంగి పోయిన నిందితుడు
పెబ్బేరు: మండల పరిధిలోని రంగాపురం ఎబిడి లిక్కర్ కంపెనీ సమీపంలో ఒక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున ఇటిక్యాల మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గొల్ల మద్దిలేటి పెబ్బేరు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి ఎదుట లొంగి పోయాడు. ఎస్సె క్లూస్ టీమ్ ను పిలిపించి సంఘటనా స్థలానికి నిందితుడు మద్దిలేటి తో పాటు చేరుకుని విచారణతో పాటు కేసు రీకన్స్ట్రక్షన్ చేసారు. వనపర్తి మండలం పెద్ద గూడెం గ్రామానికి చెందిన గొల్ల మణెమ్మ (35)తో నిందితునికి గత ఐదు సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉందని, అదే క్రమంలో నిన్న రాత్రి ఇద్దరూ కలుసుకున్నట్లు నిందితుడు తెలిపారు. సదరు మహిళ మద్యం మత్తులో ఉన్నప్పుడు ఇద్దరు శారీరకంగా కలిసినప్పుడు వెక్కిళ్లు వచ్చి స్పృహ కోల్పోయిందని, తేరుకునే లోపు నోట్లో నుండి నురగలు వచ్చి అఛేతనంగా పడి ఉందని నిందితుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై, స్థానిక పోలీస్ సిబ్బంది, క్లూస్ టీమ్ పాల్గొన్నారు.