calender_icon.png 1 October, 2024 | 5:02 AM

అల్లుడిని చంపేందుకు స్కెచ్.. కానీ తండ్రిని చంపాడు..

26-09-2024 11:47:59 AM

నిజామాబాద్, (విజయక్రాంతి): తన కూతుర్ని అల్లుడు చంపాడన్న పాత కక్షను మనసులో పెట్టుకున్న ఓ తండ్రి.. అల్లుడిని చంపాలనుకొని అతని ఇంటికి వెళ్లాడు. అక్కడ అల్లుడు లేకపోవడంతో అతని తండ్రిని కత్తులతో పొడిచి చంపారు. నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం కంజర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ తన కూతురు భవితను అదే గ్రామానికి చెందిన గోవర్ధన్ కు ఇచ్చి వివాహం చేశాడు. గోవర్ధన్ వేధింపుల వలన భవిత ఆత్మహత్య చేసుకోవడంతో అల్లుడుపై కక్షపెంచుకున్న మామ, ఎలాగైనా అతన్ని చంపాలని పథకం వేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నలుగురు వ్యక్తులతో బుధవారం అర్ధరాత్రి అతని ఇంటికి  వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.