బెల్లంపల్లి (విజయ క్రాంతి): తాండూర్ మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన కామెర దుర్గయ్య అనే వ్యక్తి గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు సమాచారం అందడంతో సోమవారం తనిఖీ చేయగా ఎనిమిది గంజాయి మొక్కలు లభించినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. కామెర దుర్గయ్య ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై చెప్పారు. గంజాయి అమ్మిన, సాగుచేసిన కాటన్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ఎవరైనా గంజాయి మొక్కలు పెంచినట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.