calender_icon.png 1 October, 2024 | 5:16 AM

మల్లన్న హుండీ@ 63.66 లక్షలు

01-10-2024 02:38:34 AM

కొండపాక, సెప్టెంబరు 30: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపును సోమవారం స్వామివారి సన్నిధిలో ఆలయ కార్యనిర్వహణాధికారి బాలాజీ, అసిసె స్టంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 76 రోజుల హుండీ లెక్కింపు లో నగదు ఆదాయం 63లక్షల 66వేల 933 రూపాయలు, మిశ్రమ బంగారం 51 గ్రాములు, మిశ్రమ వెండి 5కిలోల 50గ్రాములు, విదేశీ కరెన్సీలు 25, మిశ్రమ బియ్యం 6 క్వింటాళ్లు వచ్చినట్లు ఈవో బాలా జీ తెలిపారు.

భక్తులు పెద్ద సంఖ్యలో కానుకలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు మల్లికార్జున్, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్, ఆలయ అర్చకులు, సిబ్బంది, ఏపీజీవీబీ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.