22-01-2025 12:25:32 AM
చేర్యాల, జనవరి 21: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగుందుతున్న కొమురెల్లి మల్లన్న ఆలయానికి పట్నం వారం సందర్భంగా భక్తులు వేలాదిగా తరలి వచ్చిన సంగతి తెలిసిందే. ఆదాయం కూడా అదే స్థాయిలో మల్లన్న ఖజానాకు వచ్చి చేరింది. ఆదాయ ఆర్జించడంలో డీసీ కేటగిరీలో ఈ ఆలయం ఉంది.
కాకపోతే గత ఏడాది కంటే ఈ సంవత్సరం సుమారు రూ. 8 లక్షల 40 వేల రూపాయలు తగ్గింది. గత సంవత్సరం మొదటివారం శీఘ్ర దర్శనం, విశిష్ట దర్శనం, వివిఐపి దర్శనం, లడ్డు పులిహోర విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం రూ.70 లక్షల 22 వేల 37 రూపాయలు రాగా, ఈ సంవత్సరం అవే సేవలకు గాను రూ.61 లక్షల 81 వేల 2 వందల 28 రూపాయలు ఆర్జించడం జరిగింది.
ఈ లెక్క ప్రకారం గత సంవత్సరం కంటే రూ.8 లక్షల41 వేల79 రూపాయలు తగ్గింది. బుకింగ్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని టీజీవీబీ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి రామాంజనేయులు తెలిపారు.