calender_icon.png 3 October, 2024 | 11:54 AM

మందుల్లేవ్.. మాకుల్లేవ్

03-10-2024 02:21:36 AM

సర్కారు వైద్యంపై కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖా నల పరిస్థితి అధ్వానంగా మారిందని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘మందుల్లేవ్.. మాకుల్లేవ్.. సూదిలేదు.. దూదిలేదు’ అంటూ సర్కారు వైద్యంపై విమర్శ చేశారు. ఒకవైపు జనాలను విష జ్వరాలు వణికిస్తున్నాయని, సర్కారు దవాఖానకు పోతే మందు గోలీలు కూడా లేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.

పేదవాడికి పెద్దదిక్కుగా వున్న ప్రభుత్వ ఆసుపత్రులపై ఎందుకింత నిర్లక్ష్యం చూపిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మందుల సరఫరా ఎందుకు బందైందని, ఔషధాల కొరతకు కారణం ఎవరని నిలదీశారు. సర్కారు ఆసుపత్రులపై నమ్మకం సన్నగిల్లే పరిస్థితులు మళ్లీ తీసుకురావొద్దని సూచించారు.