19-04-2025 12:36:08 AM
బాన్సువాడ, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): బాన్సువాడ నియోజకవర్గంలోని మోస్రా మండలంలో శుక్రవారం మున్సిపాలిటీ మాజీ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో ఛలో వరంగల్ భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జుబేర్ మాట్లాడుతూ.ఛలో వరంగల్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
ప్రతి మండలంలోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వరంగల్ సభకు తరలిరావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో సాయిలు, పసుల ప్రశాంత్ రెడ్డి, కొత్తిమీర కార్ విజయ్,హలీం,ఖదీర్ ఖాన్ డేపు గణేష్, నక్కల సాయిలు, షాదుల్లా,గొల్ల ప్రశాంత్, గొల్ల దిలీప్,సంజయ్ యాదవ్,తదితరులు పాల్గోనడం జరిగింది.