05-03-2025 12:00:00 AM
మహబూబ్ నగర్, మార్చి 4 (విజయ క్రాంతి) : ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు పూర్తిస్థాయిలో మొత్తం లో 25% రాయతీ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చెల్లించేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అన్నా రు.
మంగళవారం మున్సిపల్ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన సమావేశం మంది రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఎల్ఆర్ఎస్పై అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. ఈనెల చివరి వరకు ఉన్న అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని, మున్సిపా లిటీ పరిధిలో 31వేల 190 దరఖాస్తులు ఉ న్నాయని పేర్కొన్నారు. నిర్దేశించిన సమయంలోపు చెల్లించడం వల్ల యజమానుల కు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.