calender_icon.png 26 October, 2024 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడులు పెట్టండి

06-08-2024 02:13:08 AM

జన్మభూమి రుణం తీర్చుకోండి

  1. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
  2. మా పాలనపై ఎలాటి అపోహలు వద్దు 
  3. హైదరాబాద్‌ను ప్రపంచ అగ్రగామిగా చేస్తాం 

న్యూజెర్సీలో ప్రవాసులతో సీఎం రేవంత్‌రెడ్డి 

రాష్ట్రంలో హామీల అమలుపై ఎన్నారైల ప్రశంస

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): తెలంగాణకు అత్యధిక పెట్టు బడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఆదివారం జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనానికి వేలాది మంది తరలివచ్చారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లా డుతూ.. ‘తెలంగాణ మీ జన్మభూమి. మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అంతకుమించి అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్‌గా లభిస్తుంది’ అని ఎన్నారైల్లో ఉత్సాహం నింపారు. 

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా 

గత ఏడాది టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో అమెరికాకు వచ్చానని.. పదేండ్ల దుష్పరిపాలనకు, విధ్వంసాలకు విముక్తి పలికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ వస్తానని తాను చెప్పినట్టు రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని పునరుద్ఘాంటించారు.

ఇప్పటికే రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం, అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. రైతులకు ఏకకాలంలో రూ.౨ లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే సిలిండర్, నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు అమలు చేసిన విషయాలను వివరించారు.

ఇది ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తు ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. తమ పరిపాలనపై ఎలాంటి అపోహలు, ఆందోళనలకు తావు లేదని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధించే కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తుందని వెల్లడిం చారు.  

హైదరాబాద్‌ను అగ్రగామిని చేస్తా 

ఎన్నికల ముందు తమపై విష ప్రచారం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అది ఉండనే ఉండదని వదంతులు సృష్టించినవారు ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తుందం టూ అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే వాళ్లకు తగిన బుద్ధిచెప్పామని, వాళ్ల మాటలు తప్పని మరోసారి నిరూపిస్తామని చెప్పారు. హైదరాబా ద్‌ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. 

తెలంగాణనూ అభివృద్ధి చేయండి 

తమ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలతో అమెరికాను పటిష్టంగా, సంపన్నంగా మార్చారని ప్రవాసులను సీఎం అభినందించారు. ఇకపై తెలంగాణకూ అలాంటి సేవలందించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో మెట్రోకేర్ అర్బన్‌తోపాటు సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన ముఖ్యులతో మాట్లాడారు. హైదరాబాద్, సికింద్రాబా ద్, సైబరాబాద్ తరహా నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌ను అత్యున్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. 

సీఎం కృషికి ఎన్నారైల అభినందన 

ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చేందుకు రేవంత్‌రెడ్డి చేస్తున్న కృషిని ఎన్నారైలు అభినందించారు. హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రణాళికలను ప్రశంసించారు. తెలంగా ణలో పెట్టుబడులు పెట్టాలనే ప్రచారంలో ప్రభుత్వంతో కలిసి పాల్గొంటామని హామీ ఇచ్చారు.

అంతకుముందు తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే పాటలు, నృత్యాలతో కూడిన ప్రదర్శనను ఏర్పాటుచేశారు. అనంతరం ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అధ్యక్షుడు మొహిందర్ సింగ్ గిల్జియాన్ మాట్లాడుతూ.. ‘మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలన్న మా కోరిక నెరవేరింది. ఇప్పుడు రాహుల్‌గాంధీని భారత ప్రధానిని చేయడానికి మనమందరం కష్టపడాలి’ అన్నారు. సాఫ్ట్‌వేర్, ఫార్మా, వ్యాక్సిన్‌లు, హెల్త్‌కేర్ రంగాల్లో తెలంగాణ బలమైన కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. 

* భవిష్యత్తు ప్రణాళికలతో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎలాంటి అపోహలు, ఆందోళనలకు తావు లేదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించే కొత్త పారిశ్రామిక విధానాన్ని మా ప్రభుత్వం 

తీసుకువస్తుంది.

 సీఎం రేవంత్‌రెడ్డి