calender_icon.png 19 April, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యం సద్వినియోగం చేసుకోవాలి

09-04-2025 12:40:36 AM

కలెక్టర్ వెంకటేశ్ దోత్రే

వాంకిడి,ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యాన్ని ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవా రం వాంకిడి మండల కేంద్రంలోని డి.ఆర్. డిపోలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలో అర్హులైన ప్రతి రేషన్ కార్డుదారుడు సన్న బియ్యం సద్వినియోగం చేసుకో వాలని తెలిపారు. నాణ్యతతో కూడిన సన్నబయ్యంను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని, రేషన్ డీలర్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా సక్రమంగా కార్డుదా రులకు బియ్యం అందజేయాలని తెలిపారు.

సన్న బియ్యం తీసుకున్న లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వాంకిడి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న నర్సరీని సందర్శించి మొక్కల సంరక్షణ చర్యలను పరిశీలించారు. వేసవికాలం అయినందున సకాలంలో మొక్కలకు నీటిని అం దించాలని, మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నర్సరీ నిర్వాహకులు, పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండ ల తహసిల్దార్ రియాజ్ అలీ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.