03-03-2025 06:49:33 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గం బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలుగా ఇటీవల మరోసారి ఎన్నికైన బర్ల నాగమణితో పాటు అన్ని మండలాల మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు సోమవారం మణుగూరులోని ప్రజాభవన్ లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ బోడ దివ్య, బూర్గంపాడు మండల మహిళ అధ్యక్షులు భూక్య సుగుణ, మణుగూరు మండల అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.