calender_icon.png 10 October, 2024 | 3:49 AM

మండలి చీఫ్‌విప్‌గా మహేందర్‌రెడ్డి

10-10-2024 01:47:38 AM

శాసనమండలి చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి  బుధవారం  బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మహేందర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు  శ్రీధర్‌బాబు , పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఈర్లపల్లి శంకర్, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు కోదండరామ్, బల్మూరి వెంకట్, యెగ్గె మల్లేశ్, మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్, గడ్డం రంజిత్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ పట్నం సునీతారెడ్డి, భీంభరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మండలి చీఫ్ విప్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.