వికారాబాద్ రూరల్, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): శాసనమండలి చీఫ్ విప్గా ఎమ్మెల్సీ డాక్టర పట్నం మహేందర్ రెడ్డికి బాధ్యతలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 4న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే సర్కార్ ఎస్కార్ట్ వాహనాలను కేటాయించింది. అలాగే ఎనిమిది మంది ఎస్కార్ట్ సిబ్బందిని నియమించింది. బాధ్యతలు చేపట్టిన తర్వాత సర్కార్ ఆయన్ను ప్రొటోకాల్ పరిధిలోకి రానున్నదని సమాచారం.