26-02-2025 07:18:09 PM
బైంసా (విజయక్రాంతి): భైంసా పట్టణంతో పాటు ముధోల్ నియోజకవర్గంలో బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్థానిక దేవదేవుని ఆలయాల్లో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ సైతం శివాలయాన్ని సందర్శించి పూజలు చేశారు.