calender_icon.png 1 October, 2024 | 9:06 PM

నవరాత్రులకు మహాశక్తి ఆలయం ముస్తాబు

01-10-2024 12:00:00 AM

3 నుంచి 12 వరకు ఉత్సవాలు

కరీంనగర్, సెప్టెంబరు 30 (విజయక్రాంతి): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం ముస్తాబవుతున్నది. హింపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 12వ వరకు కన్నుల పండువగా నవరాత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. భవానీ దీక్షల కోసం తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.