15-04-2025 12:00:00 AM
బాపట్ల తహసీల్దార్ సలీమా
గుంటూరు, ఏప్రిల్ 14: నేటి సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని బాపట్ల తహసీల్దార్ సలీమా కొనియాడారు. సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. మన దేశ ఖ్యాతిని ఖండాంతరాల్లో ఇనుమడింపజేసిన గొప్ప మేధావి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ప్రపంచంలో మరే దేశానికి లేని అత్యున్నత రాజ్యాంగాన్ని మనకందించిన మహనీయుడు అని కొనియాడారు.