calender_icon.png 20 October, 2024 | 5:23 AM

మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ

20-10-2024 02:55:07 AM

ఆధ్వర్యంలో ఘనంగా ఎఫ్-టామ్ కృతజ్ఞత సభ

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (విజయక్రాంతి): మహారాష్ట్ర తెలుగు సాహి త్య అకాడమీ ఆధ్వర్యంలో ఎఫ్-టామ్ కృతజ్ఞత సభ ఘనంగా నిర్వహిచారు. ఎఫ్-టామ్ అధ్యక్షుడు గంజి జగన్‌బాబు సభికులందరికీ స్వాగతం పలికారు. సుమా రు 150 మంది తెలుగు భాషా, సాంస్కృతిక అభిమానులతో శుక్రవారం ముంబైలోని మైసూర్ అసోసియేషన్ హాల్‌లో సభను నిర్వహించారు.

ముఖ్యఅతిథి రాజ్యసాహిత్య అకాడమీ సంచాలకులు సచిన్ నింబాల్కర్ కార్య ప్రణాళికను వివరించారు. వివిధ అవార్డులు, జీవన సాఫల్య అవార్డు, సాహిత్య అవార్డు, కళా అవార్డు, మరాఠీ నుంచి తెలుగులోకి అనువాద అవార్డు, పుస్తక విమోచన సహాయం, కొత్త రచయిత అవార్డు, అకాడమీ కార్యక్రమాలు మహారాష్ట్ర అంతటా ఘనంగా జరుపుతామని తెలిపారు.

ఈ సందర్భంగా అకాడమీ కమిటీ సభ్యులుగా వివిధ హోదాల్లో పీవీ రమణ, సంగెవేని రవీంద్ర, గుండారి శ్రీనివాస్, కంటే అశోక్, రవీనా చవాన్, హరీశ్ కెంచిలను నియమించారు. మహారాష్ట్ర గడ్డపై ప్రభుత్వ తెలుగు అకాడమీ ఏర్పాటు కావడం ఎంతో గర్వకారణమని అన్నారు.