calender_icon.png 3 October, 2024 | 6:53 PM

మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ధ్రువపత్రాల పంపిణీ

03-10-2024 03:59:23 PM

మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. గురువారం మున్సిపాలిటీ ఫరిధిలోని 8 వ వార్డులో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మహంత్ అర్జున్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహా లక్ష్మి పధకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు గ్యాస్ రాయితీ ద్రువపత్రాలను అందించారు. ఈ సందర్బంగా అర్జున్ మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఆరు గ్యారంటీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుద్దాల జనార్దన్, మెప్మా ఆర్పి సరోజ వార్డు ప్రజలు పాల్గొన్నారు.