13-02-2025 01:29:35 AM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి గుర్తు... మహాకుంభమేళా అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మహాకుంభమేళా సందర్భంగా బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి దత్తాత్రేయ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రపం చంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉం దని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.