ట్రాఫిక్ కిట్లని పంపిణీ చేసిన ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్, విజయ క్రాంతి : వాహనదారులను భద్రంగా ఇంటికి చేర్చే బాధ్యత ట్రాఫిక్ పోలీసులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి సూచించారు. గురువారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ని సందర్శించి, ట్రాఫిక్ కిట్లను జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ వల్ల ఆక్సిడెంట్స్ కాకుండా పరోక్షంగా ప్రజల ప్రాణాలను కాపాడిన వారు అవుతారని ట్రాఫిక్ సిబ్బందిని ఉద్ధేశించి మాట్లాడారు, సిబ్బంది అందరూ సమిష్టిగా కృషిచేయాలని పలు సూచనలు చేశారు.
వానచోదరులకు ట్రాఫిక్ నిబంధనలను అవసరమైనప్పుడల్లా మర్యాదగా సూచించాలని తెలియజేశారు. మీరు క్షేమంగా ఇంటికి వెళ్లిందుకే మేము నిరంతరము ఎండకు వానకు లెక్కచేయకుండా శ్రమిస్తున్నామని వాహన చోదకులకు తెలిసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటేశ్వర్లు, వర్టికల్ డిఎస్పి సుదర్శన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ శంషుద్దీన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.