calender_icon.png 9 October, 2024 | 11:51 AM

ఫార్మా కంపనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా మహాపాదయాత్ర

09-10-2024 10:04:03 AM

కొడంగల్, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని పలు గ్రామాల శివారు ప్రాంతాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి నేడు మహా పాదయాత్ర చేపట్టనున్నారు. దుద్యాల మండలంలోని హకీమ్ పేట, పోలేపల్లి, రొటిబండ తండా ఈర్ల పల్లి తండా తదితర గ్రామాల రైతుల భూముల్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మా కంపనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పోలేపల్లి రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి దుద్యాల మండల తహసీల్దార్ కార్యాలయం వరకు మహాపాద యాత్ర నిర్వహించి అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు.పచ్చటి పంట పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటుతో వాతావరణం కాలుష్యంతో ఆయా గ్రామాలు అందకరమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ,భూ బాధిత రైతులు, బీఅర్ఎస్ పార్టీ నాయకులు ,ఆయా గ్రామాల ప్రజలు పాల్గొననున్నారు