రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మాసశివరాత్రి సందర్భంగా సోమవారం వైభవంగా మహాలింగార్చన నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఆలయంలోని పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు, పూజలు చేసి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.