ఫెమినా మిస్ ఇండియా 2024 కిరీటాన్ని మధ్య ప్రదేశ్ కు చెందిన నిఖిత పోర్వాల్ గెలుచుకున్నారు. ముంబైలోని ఫేమస్ స్టూడియోస్లో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచిన నిఖిత మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో మిస్ వరల్డ్ అందాల పోటీల్లో భారత్ తరుఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రేఖా పాండయ్య, గుజరాత్కు చెందిన ఆయుషి ధోలాకియా అందాల పోటీలో మొదటి రెండవ రన్నరప్లుగా నిలిచారు.
60 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో భాగంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముద్దుగుమ్మలు పోటీ పడ్డారు. కేవలం తమ అందాలతోనే కాకుండా తమ ప్రతిభతోనూ జడ్జిలతో ప్రశంసలు అందుకున్నారు. తుదిపోరులో అదరగొట్టిన నిఖిత పోర్వాల్ కిరీటాన్ని దక్కించుకున్నారు. 2023 నుండి టైటిల్ను కలిగి ఉన్న రాజస్థాన్కు చెందిన మునుపటి టైటిల్హోల్డర్ నందిని గుప్త తర్వాత నిఖిత విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన ప్రయాణం ఇప్పుడే ప్రారంభం అయిందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని చెప్పారు.