calender_icon.png 26 October, 2024 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధుయాష్కీ ఘాటు వాక్యాలు..

26-10-2024 03:05:25 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీపై ప్రేమతో రాలేదని అక్రమ ఆస్తులు కాపాడుకునేందుకు, రాజకీయ భవిష్యత్‌ కోసం వచ్చారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ ఘాటు వ్యాఖలు చేశారు. ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి హత్యకు గురికాగా శనివారం ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌తో కలిసి సంతాపంకు హాజరై గంగారెడ్డి కుటంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని పడగొడుతామని కొందరు పదే పదే అంటుంటే స్వతహగా వస్తామనటంతో పార్టీలో చేర్చుకున్నామని చేరమని ఎవరిని అడగలేదన్నారు. కొత్తవారిని చేర్చుకున్నంత మాత్రానా పాత వారిని అవమానించే ప్రసక్తి లేదన్నారు. నామినేటేడ్‌ పదవులన్నీ కాంగ్రెస్‌ పార్టీకోసం పని చేసిన వారికే ఇచ్చే విధంగా అధినాయకత్వంతో తాను మాట్లాడుతానని అన్నారు.