calender_icon.png 13 March, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ట్రెజరర్​గా మధుసూదన్

12-03-2025 09:14:57 PM

ఎల్బీనగర్: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయూ అనుబంధం సంస్థ ‘టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా’ రంగారెడ్డి జిల్లా ట్రెజరర్​గా సూరేపల్లి మధుసూదన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండలం, ప్రొద్దుటూరు గ్రామం ప్రగతి రిసార్ట్స్ లో జరిగిన రెండో మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, జిల్లా అధ్యక్షుడు సలీం ప్రకటించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ..19 ఏండ్లుగా ‘TV5’  రిపోర్టర్ గా పని చేస్తూ రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జాయింట్ సెక్రటరీగా పనిచేశానని,  ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ట్రెజరర్​గా ఎన్నికైనట్లు తెలిపారు.  జిల్లాలోని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మధుసూదన్​చెప్పారు. తనపై నమ్మకంతో ఈ పదవీ బాధ్యతలు అప్పగించినందుకు  రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.