అబ్దుల్లాపూర్మెట్, సెప్టెంబర్ 20: రాష్ట్రంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్గా గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు పేరుంది. ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా చిలుక మధుసూదన్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఆశీస్సులు ఉండడంతో మధుసూదన్రెడ్డిని చైర్మన్ పదవి దక్కింది. ఆయనతో పాటు వైస్ చైర్మన్గా భాస్కరాచారిని ప్రకటించారు. మొత్తం 18 మంది సభ్యులతో మార్కెట్ కమిటీని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్తోపాటు 12 మంది సభ్యులు, హయత్నగర్ పీఏసీఎస్ చైర్మన్, అసిస్టెంట్ హార్టికల్చర్ అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి, తుర్కయంజాల్ మున్సిపల్ చైర్మన్ సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ సంచాకులు రఘునందర్రావు ఉత్తర్వులు జారీ చేశారు.