calender_icon.png 14 October, 2024 | 6:55 PM

మనలో మనకే ఐక్యత లేదు.. అందుకే ఈ దారుణాలు

14-10-2024 03:51:46 PM

సికింద్రాబాద్,(విజయక్రాంతి): సికింద్రాబాద్ మోండా మార్కెట్ అమ్మవారి గుడి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మోండా మార్కెట్లో ఉన్న ముత్యాలమ్మ దేవాలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు సోమవారం తెలవారుజామున ద్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే ముత్యాలమ్మ గుడి ప్రాంగణానికి బీజేపీ నేత మాధవి లత చేరుకున్నారు. దీంతో మాధవి గుడి ముందు బైఠాయించడంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. మాధవి లతను పోలీసులు ఆరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాధవి లత మాట్లాడుతూ... అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన వాళ్ల మతం ఇస్లాం మతం అని, ఇంత జరిగినా పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.

మొదటగా హిందువులకు ఐక్యత ఉండాలి. మనలో మనకే ఐక్యత లేకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోజు రోజుకు రాష్ట్రంలో ఉన్న హిందు దేవలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం బాధకరమన్నారు. కొన్ని రోజుల క్రితం పాతబస్తీలో అమ్మవారి దేవాలయం, మొన్న గోశామహల్ లో అమ్మవారి విగ్రహం, ఇప్పుడు సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయంపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు పాత బస్తీలో అక్కడక్కడ వరకు మాత్రమే జరిగిన ఈ దాడులు నగర వ్యాప్తంగా వ్యాపించాయి.