calender_icon.png 4 October, 2024 | 4:52 PM

మంత్రి శ్రీధర్ బాబును సన్మానించిన మచ్చుపేట ముదిరాజ్ కుల పెద్దలు

04-10-2024 02:28:17 PM

ముత్తారం (విజయ క్రాంతి): మండలంలోని మచ్చుపేట గ్రామానికి చెందిన ముదిరాజ్ కుల పెద్దలు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును శుక్రవారం ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి దేవాలయానికి సహాయం చేయాలని వారు మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పెద్దమ్మ తల్లి దేవాలయానికి తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ముదిరాజ్ కుల పెద్దలు శ్రీధర్ బాబు ను చాలువాతో సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, మండల అధ్యక్షులు దొడ్డ బాలాజి, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు వాజిద్ పాషా, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు బియ్యని శివకుమార్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భక్కతట్ల వినీత్, మచ్చుపేట గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపెళ్లి కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోవిందుల ఆనంద్ దుండే రాజేశం, సిలివేరు లక్ష్మణ్, బియ్యని రాజబాబు, కోల విజయ్ మరియు మచ్చుపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.