calender_icon.png 10 October, 2024 | 1:50 PM

మచారెడ్డి మండలం ఆరేపల్లి స్టేజ్ దగ్గర రోడ్డు ప్రమాదం

10-10-2024 11:23:27 AM

బైక్ పై వెళుతున్న వ్యక్తిని ఢీకొన్న లారీ అక్కడికక్కడే యువకుడు మృతి

కామారెడ్డి (విజయక్రాంతి): బైక్ పై వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఆరేపల్లి స్టేజి వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల వైట్ నుంచి ఇసుక లారీ లోడుతో కామారెడ్డి వైపు వస్తున్న లారీ బైక్ పై వెళుతున్న యువకున్ని ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ అధిక స్పీడ్ తో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు తెలిపారు. మృతి చెందిన యువకుడు వివరాలు తెలియాల్సి ఉంది.