23-02-2025 11:43:12 AM
కొత్తగూడెం,(విజయక్రాంతి): శ్రీరాంపుర్ ఏరియా జనరల్ మేనేజర్గా పనిచేస్తూ ఇటీవల సింగరేణి సంస్థ డైరెక్టర్గా ఎల్. వి. సూర్యనారాయణ నియమితులయ్యారు. ఆదివారం సింగరేణి ప్రధాన కార్యాలయంలోని డైరక్టర్ ఛాంబర్ నందు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సంధర్భముగా అన్ని శాఖల జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు, డైరెక్టర్ ఎల్. వి. సూర్యనారాయణని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.