calender_icon.png 19 October, 2024 | 8:44 PM

ఎల్ఆర్ఎస్ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి

19-10-2024 06:23:17 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. శనివారం కాగజ్ నగర్ మండలంలోని ఎన్.జి.ఓ.ఎస్. కాలనీ, గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్‌.ఆర్‌.ఎస్‌.-2020 పథకంలో అనుమతి లేని లే-అవుట్ల క్రమబద్దీకరణ కొరకు అందిన దరఖాస్తులను రికార్డులు సరి చూసి సదరు ప్లాట్ల భౌగోళిక స్థితిని పరిశీలించి ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు.

నిషేధిత, ప్రభుత్వ భూములు, చెరువు శిఖం, వాగుల సంబంధిత భూముల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది క్షేతస్థాయి పరిశీలనకు వెళ్ళినప్పుడు దరఖాస్తుదారుడికి సమాచారం అందించి దరఖాస్తు సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించాలని తెలిపారు. సర్వే ప్రక్రియను నిర్ణీత గడువు లోగా పూర్తి చేసి తదుపరి కార్యచరణకు రికార్డు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి, తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, టీం సభ్యులు, పంచాయితీ కార్యదర్శి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇరిగేషన్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.