నిందితుడిని అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఖరీదైన మద్యం బాటిళ్లలో తక్కువ ధరకు లభ్యమయ్యే మద్యం నింపి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్లోని ఇందిరానగర్లో ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన సత్య భారత్ శైల తన ఇంట్లో ఖరీదైన మద్యం బాటిళ్లలో తక్కువ ధరకు లభించే మద్యంను నింపి మార్కెట్ ధరల కంటే తక్కువకే తెలిసినవారికి విక్రయిస్తుంటాడు.
ఇతనికి వెస్ట్ బెంగాల్కు చెందిన మలీనా దాసు సహకరిస్తుంటాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ సీఐ చంద్రశేఖర్ తన బృందంతో కలిసి ఆదివారం వారి నివాసాలపై దాడులు జరిపగా రూ. 40 వేలు విలువ చేసే 8 నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మలీనా దాసును అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు సత్య భారత్ పరారీలో ఉన్నాడని త్వరలోనే అతడిని పట్టుకుంటామని ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎస్టీఎఫ్ టీం లీడర్ నంద్యాల అంజిరెడ్డి తెలిపారు.