04-03-2025 12:00:00 AM
తమిళ నటుడు మిథున్ చక్రవర్తి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ద్విభాషా చిత్రం ‘లవ్ స్టోరీ బిగిన్స్’. తమిళ, తెలుగు భాషల్లో వర్మ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో వర్ష, శ్వేత కథానా యికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘వస్తావా..’ అనే పాట విడుదలైంది. అమర్ గీత్ సంగీత సారథ్యంలో శివమణి రాసిన ఈ పాటను భవదాయిని నాగరాజ్, విద్యుత్ శ్రీనివాస్, థామస్ చిరమేల్ అలెగ్జాండర్ ఆలపించారు.
హైదరాబాద్లో ఏర్పాటుచేసిన ఈ గీతావిష్కరణ కార్యక్రమంలో హీరో మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ.. “నా జీవితంలో జరిగిన యధార్థ సం ఘటనల ఆధారంగా రూపొందిస్తున్న ‘లవ్ స్టొరీ బిగిన్స్’ సినిమా ప్రేమచిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. ఈ చిత్రాన్ని ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని తెలిపారు. ‘ఈ చిత్రంలో నటిం చే అవకాశం లభించడం ఆనందంగా ఉంది’ అని పట్ల హీరోయిన్లు వర్ష, శ్వేత చెప్పారు.