calender_icon.png 22 September, 2024 | 4:47 AM

ప్రేమ జంట బలవన్మరణం

22-09-2024 02:53:29 AM

పాఠశాల స్థాయి నుంచే ప్రేమాయణం

పెళ్లికి అంగీకరించని పెద్దలు?

కామారెడ్డి జిల్లాలో ఘటన 

కామారెడ్డి, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో శనివారం కలకలం రేపిం ది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కొనాపూర్‌కు చెందిన మొగిలి సాయికుమార్ (24) , అంబారిపేట్‌కు చెందిన రంగోలి వీణ (23) పాఠశాలలో ఉన్నప్పటి నుంచే ప్రేమించుకున్నారు. కొనాపూర్‌లో ఏడవ తరగతి వరకే ఉ ండటంతో సాయికుమార్ అంబారిపేట్‌లోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతి లో చేరాడు. ప్రతి రోజు పాఠశాలకు వచ్చి కొనాపూర్‌కు వె ళ్లేవాడు.

ఇద్దరిది ఒకే తరగతి కా వడంతో అ ప్పుడే ప్రేమ చిగురించింది. ఇద్దరూ కామారెడ్డిలో ఒకే కాలేజీలో ఇంటర్, డి గ్రీ పూర్తి చేశా రు. డిగ్రీ వరకు చదివిన వీణ ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటుంది. సాయికుమార్ డిగ్రీ పూర్తి చేసి మేడ్చల్‌లో బీపీఈడీ చదువుతున్నాడు. ఈ క్రమంలో వారి ప్రేమ విషయం తల్లిదం డ్రులకు చెప్పారు. కులాలు వేరు కావడంతో ఇద్దరి తల్లితండ్రులు నిరాకరించారు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చి న సాయికుమార్ వీణతో ఫోన్‌లో మాట్లాడాడు. తల్లిదండ్రులు పెండ్లికి ఒప్పుకోకపోవ డంతో మొదట విడిపోదామని భావించారు. కానీ అందుకు మన సు అంగీకరించక చనిపోదామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో సాయికుమార్ కొనాపూర్‌లో తన వ్యవసాయ బావి వద్ద చె ట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు గంటల తరా త అంబారిపేట్‌లో వీ ణ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ప్రే మ వ్యవహారం కాదని, అనారోగ్యం కారణంతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నద ని దోమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయికుమార్ త ల్లితండ్రులు కూడా తమ కూమారుడు అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు బీబీపేట పోలీసులకు ఫిర్యాదు చేయడం పలు అ నుమానాలకు తావిస్తున్నది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దోమకొండ పోలీసులు తెలిపారు.