calender_icon.png 14 February, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొబ్బరి బొండాలు కొనడానికి వెళ్తే కారులో ఉన్న రెండు లక్షల మాయం

13-02-2025 11:14:00 PM

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఘటన...

కామారెడ్డి (విజయక్రాంతి): కొబ్బరి బొండాలు కొనడానికి వెళ్లిన ఓ వ్యక్తి తన కారులో ఉన్న రెండు లక్షలు మాయమైన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ పరిధిలోని, ఇబ్రహీంపేటకు చెందిన చందర్ ఈ నెల 10న బ్యాంకు నుండి రూ.2 లక్షల డ్రా చేసి ప్రభుత్వం ఆసుపత్రి వద్ద కొబ్బరి బొండాలు కొనడానికి కారు ఆపాడు. రెండు లక్షల నగదు డబ్బులు కారులోనే ఉంచాడు.

కొబ్బరి బొండాలు కొని కారు వద్దకు వెళ్లే సరికి కారులో చూడగా డబ్బు కనపడలేదు. దీంతో బాధితుడు చందర్ పోలీసులకు పిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు మంగళవారం బాన్సువాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొబ్బరి బొండాల దుకాణం వద్ద ఉన్న సీసీ కెమారాలో గుర్తు తెలియని దుండగులు వచ్చి కారులో ఉన్న డబ్బు మాయం చేసినట్లు కనపడిందని పోలీసులు తెలిపారు. బాధితుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైఐ తెలిపారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.