calender_icon.png 24 October, 2024 | 10:52 AM

స్కూల్ బస్సును ఢీకొన్న లారీ.. 15 మంది విద్యార్థులకు గాయాలు

02-07-2024 12:08:46 PM

కావలి: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి జాతీయ రహదారిపై స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా... 15 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం హుటాహుటిన కావలి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.  స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించి, సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ  విషయం తెలుసుకున్న కావలి ఎంఎల్ఎ కావ్య కృషారెడ్డి ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగాఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.