calender_icon.png 5 October, 2024 | 6:44 PM

యూట్యూబర్ హర్ష సాయిపై లుక్‌అవుట్ నోటీసులు

05-10-2024 03:43:53 PM

హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ హర్ష సాయి కోసం నార్సింగి పోలీసులు శనివారం లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై నార్సింగి పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హర్ష సాయి  తనను ప్రైవేట్ ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని కూడా ఆరోపించించింది. ఒక పార్టీలో కలిసిన తర్వాత హర్ష సాయి తనతో స్నేహం చేశాడని, ఇద్దరూ కలిసి వేర్వేరు రంగాల్లో పనిచేస్తున్నారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ హర్ష సాయిపై ఓ మహిళ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడంతో గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలుస్తున్నాడు. హర్ష సాయిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే తనపై కేసు పెట్టిన రోజు నుంచి హర్ష సాయి పరారీలో ఉన్నాడు.