calender_icon.png 1 October, 2024 | 10:22 AM

ప్రభుత్వ గురుకుల భవనానికి తాళం

01-10-2024 12:00:00 AM

అద్దె చెల్లించనందుకు యాజమాని ఆగ్రహం

అలంపూర్, సెప్టెంబర్ 30: గద్వాల జిల్లా  ఎర్రవల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల గేట్‌కు సోమవారం తాళం వే శారు. అద్దె భవనంలో పాఠశాల కొనసాగుతున్నది. అద్దె బకాయిలు చెల్లించలేదని భవన యజమాని ప్రధాన గేటుకు తాళం వేశాడు. ఉ పాధ్యాయులను లోపలికి అనుమతించలేదు. గతంలో అయిజ మండలానికి గురుకుల పాఠశాల మంజూరు అయ్యింది.

అక్కడ విద్యార్థుల కు సరైన వసతులు, సౌకర్యాలు లేని కారణం గా తాత్కాలికంగా ఎర్రవ ల్లి మండల కేంద్రానికి తరలించారు. ఎర్రవల్లిలో భవనాన్ని కిరాయికి తీసుకుని నిర్వహిస్తున్నారు. అయితే గత తొమ్మిది నెలలుగా భవనానికి అద్దె చెల్లించకపోవడంతో యజమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో విద్యార్థులు ఉండగా ప్రధాన గేట్‌కి తాళం వే శారు. సంబంధిత అధికారులు మాట్లాడి బిల్లులు త్వరగా చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో గేట్ తెరిచాడు.