తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ యాక్షన్ డ్రామా షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం.. తదుపరి దశ చిత్రీకరణ స్పెయిన్లో జరగనుంది.
దర్శకుడు అధిక్ రవిచంద్రన్, సినిమాటోగ్రాఫర్ అభినాథన్ రామానుజం తమ సిబ్బందితో కలిసి బుధవారం స్పెయిన్ చేరుకున్నారు. రేపట్నుంచి వారంతా అక్కడి షూటింగ్ లొకేషన్స్ ఫైనలైజింగ్ చేసే పనిలో నిమగ్నమవుతారు. ఇక్కడ అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.
మొత్తంగా స్పెయిన్ షెడ్యూల్ షూటింగ్ 50 నుంచి 70 రోజుల పాటు కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారని వినికిడి. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుందని, మే 1న విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు.