అధికారులకు కలెక్టర్ ఆదేశం
పలువురు పట్టాదారులకు నోటీసులు
మంచిర్యాల, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ము న్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల చెరువు క బ్జా, ఎఫ్టీఎల్ లెవల్లో ప్లాట్ల విక్రయాలపై విజయక్రాంతి దినపత్రికలో ఈ నెల 14న ‘చెరువులోనే ప్లాట్ల దందా!’ శీర్షికన ప్రచురి తమైన కథనానికి అధికారులు స్పందించా రు. చెరువు ఆక్రమణ, ఎఫ్టీఎల్ పరిధిని గు ర్తించాలని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు జి ల్లా కలెక్టర్కుమార్ దీపక్ గురువారం ఆదేశా లు జారీ చేశారు. ఇటిక్యాల చెరువు లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని లక్షెట్టిపేట, ఊత్కూ ర్, ఇటిక్యాల గ్రామాల మధ్య ఉంటుంది.
మూడు గ్రామాల్లోని 39 సర్వే నెంబర్లలోని రైతులకు నోటీసులు జారీ చేయాలని ఇరిగేషన్ డీఈఈ కుమార్ ఈ నెల 21న లక్షె ట్టిపేట తహసీల్దార్కు లేఖ రాశారు. ఇరిగేషన్ అధికారులు ఇటిక్యాల చెరువు ఎఫ్ టీఎల్ కింద సర్వే నంబర్ల జాబితా అందజేశారని, మూడు గ్రామాల శివారులోని ఆ యా సర్వే నంబర్లలో ఉన్న వారి వివరాలతో నోటీసులు సిద్ధం చేస్తున్నామని లక్షెట్టిపేట తహసీల్దార్ దిలీప్ కుమార్ తెలిపారు.