calender_icon.png 28 October, 2024 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల జన గణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

29-07-2024 04:10:01 PM

బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగరం శంకర్ లాల్

పెద్దపల్లి, (విజయక్రాంతి) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వరంగల్లో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీ ప్రకారం బీసీ కుల గణన చేసి దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచి సానుక స్థావంతలు ఎన్నికలకు వెళ్లాలని బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగరం శంకర్ లాల్ అన్నారు. సోమవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో 52 నుంచి 60 శాతం వరకు ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని రిజర్వేషన్లు పెంచిన తదుపరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో దేశంలో బీసీలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేకుంటే బీసీలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 77 సంవత్సరాల పాలనలో బీసీలకు న్యాయం జరగలేదని ఇప్పటికైనా బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో అభివృద్ది సాధించేందుకు రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ కులాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఐక్యతతో ఉండలన్నారు.