calender_icon.png 24 October, 2024 | 11:51 AM

కొందరికే కాదు... అందరికీ రుణమాఫీ చేయాలి

29-08-2024 03:37:45 PM

ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు డిమాండ్

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బెజ్జూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పాల్వాయి హరీష్ బాబు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కేవలం కొందరికి మాత్రమే రుణమాఫీ చేసి ప్రభుత్వం చేతుల దులుపుకుంటుందని ఆరోపించారు .అందరికీ రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 65 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలు ఉంటే కేవలం 18 వేల కోట్లు మాత్రమే కేటాయించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసిందని విమర్శించారు.

బెజ్జూరు సహకార సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకొని అవినీతికి పాల్పడిన వారి నుండి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ , సొసైటీ అక్రమాల విషయంలో న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం, భాజపా జిల్లా ఓబీసీ మోర్చ అధ్యక్షులు చప్పిడి సత్యనారాయణ, మండల అధ్యక్షులు ఉమ్మేర బాలకృష్ణ, జాడి దిగంబర్, జునగరి మధుకర్, మాజీ జడ్పీటిసి ఎల్ములే మల్లయ్య, మాజీ ఎంపిపి కొప్పుల శంకర్, మాజీ వైస్ ఎంపిపి తాళ్ళ రామయ్య, భాజపా నాయకులు, కార్యకర్తలు, మండల రైతులు పాల్గొన్నారు.