మానకొండూర్, అక్టోబరు 25: కరీంనగర్ జిల్లా పరిధిలోని ఎల్ఎండీ రిజర్వాయర్కు మిడ్ మానేరు, ఎగువ కాలువ నుంచి ఇన్ఫో వస్తుండటంతో ఎస్సారెస్పీ అధికారులు శుక్రవారం 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి సుమారు 3,280 క్యూసెక్కుల నీరు ఎల్ఎండీ రిజర్వాయర్లోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్లో 24 టీఎంసీల(గరిష్ట) నీరు ఉంది. రెండు గేట్లను ఎత్తి 3వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగితే గేట్ల ద్వారా నీటిని నిరంతరంగా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.