04-09-2024 10:21:56 AM
కరీంనగర్,(విజయక్రాంతి): లోయర్ మానేరు డ్యామ్ ఎగువ పరివాహక ప్రాంతాలలో మరియు ఉత్తర తెలంగాణాలో అతిభారీ వర్ష సూచన కారణంగా ఏక్షణం లోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, నీటిని దిగువకు వదిలే అవకాశం ఉన్నది. రెవిన్యూ, పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసొకొవలసిందిగా గ్రామాలలో దండోరా వేయించాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు. నదీ పరివాహక ప్రాంతం లోకి పశువులు గాని ,గొర్రెలు మొదలగునవి వెళ్లకుండా అలాగే చేపలు పట్టేవారు, గొర్రె కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండవలెనని కోరారు. లోయర్ మానేరు జలాశయం దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా కలెక్టర్ ఆదేశించారు.