న్యూఢిల్లీ: రతన్ టాటా నిజమైన లెజెండ్ అని భాజపా సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ అన్నారు. తాను అభిమానించే వ్యాపారసంస్థల్లో టాటా గ్రూప్ ఒకటని ఆడ్వానీ తెలిపారు. టాటా గ్రూప్ వైభవాన్ని దశాబ్దాలపాటు రతన్ ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. జేఆర్డీ టాటా వారసుడిగా తానమేంటో నిరూపించుకున్నారని ఆయన తెలిపారు. తాను భారత రత్న అందుకున్న సందర్భంగా అభినందనలు చెబుతూ రతన్ టాటా లేఖ పంపించారని గుర్తుచేసుకున్నారు. భారత పరిశ్రమపై టాటా చెరగని ముద్ర వేసారని మాజీ ఉప ప్రధాన మంత్రి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. భారతదేశంలోని అతిపెద్ద సమ్మేళనాలలో ఒకటైన టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా, 86 ఏళ్ళ వయసులో మరణించారు. సోమవారమే, పారిశ్రామికవేత్త సోషల్ మీడియా పోస్ట్లో తన ఆరోగ్యంపై ఉన్న ఊహాగానాలను తోసిపుచ్చారు. అతని వయస్సు కారణంగా సాధారణ వైద్య పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ బుధవారం అర్థరాత్రి ఒక ప్రకటనలో టాటా మరణాన్ని ప్రకటించారు.