హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): సెప్టెంబర్ 1 నుంచి అఖిల భారత పశుగణన చేపడుతున్నామని, ఇంటికివచ్చే విషయ సేకరణ అధికారులకు పశువుల సమ గ్ర సమాచారాన్ని అందించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పశుగణన పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. సెప్టెంబర్ 10లోగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేయాలని డీఈవో ఆర్.రోహిణిని ఆదేశించారు.